Pavan kalyan: ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన తరమికొట్టడమే వారాహి లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల నడుమ తన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. నేటి నుంచి రాష్ట్రంలో రాక్ష్యస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమని తెలిపారు. మరికాసేపట్లో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నేతలతో పవన్ సమావేశం కానున్నారు.
మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు, ధర్మపురి ఆలయాలను పవన్ సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన పవన్.. ఆ తర్వాత వారాహి వాహనానికి పూజలు చేయించారు.