CM Jagan : తాజాగా శిక్షణ పూర్తిచేసుకున్న ఐపీఎస్ ఆఫీసర్లు సీఎం క్యాంపు కార్యలయానికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ను కలిసారు. యువ ఐపీఎస్ ఆఫీసర్లకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మంచి పోలీస్ వ్యవస్థను నిర్మించాలని. ఆధునిక పరిగ్నానాన్ని ఉపయోగించుకొని మరింత పటిష్టంగా సేవలు అందించాలని అన్నారు. సమాజంలో పోలీస్ వ్యవస్థపై అతి పెద్ద బాధ్యత ఉందని. దానిని సక్రమంగా నిర్వర్తించాలన్నారు. యువ ఐపీఎస్ ఆఫీసర్లు ధీరజ్ కునుబిల్లి, జగదీష్ అడహళ్లి, సునీల్ షెరాన్, రాహుల్ ముఖ్యమంత్రి జగన్ను కలిసి పుష్పగుచ్చం అందించారు.