Chandrababu : విశాఖలో జనసేన నేతల అక్రమ అరెస్టులను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వైకాపా పోలీసులతో రాజ్యమేలుతోందని మండిపడ్డారు. జనసేన తలపెట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకొని జనసేన నేతలను బెదిరించి అరెస్టు చేయడం దారుణమన్నారు. పవన్కు నోటీసులివ్వడం నియంత పాలనను తలపిస్తోందన్నారు. పవన్ కాళ్యాన్కు చంద్రబాబే ఫోన్ చేసి ఈ అంశంపై చర్చించారు.
అరెస్ట్ చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని బాబు డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన అక్రమ కేసులను కూడా ఎత్తివేయాలన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి పురందేశ్వరి కూడా ఈ దాడులను ఖండించారు. పవన్తో ఆమె ఫోన్లో మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా జనసేన కార్యకర్తలపై జరిగిన దాడులను ఖండించారు. లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ కూడా ఈ దాడులను ఖండించారు.