Naga chaitanya: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సంచలన విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. తాజాగా నిర్వహించిన ఈ సినిమా విజయోత్సవ సభలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య, అఖిల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్.వి రంగారావు గారు.. వీరంతా తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడమంటే మనల్ని మనం కించపరుచుకోవడమే’’ అంటూ ట్వీట్ చేశారు.
విజయోత్సవ సభలో సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంగతులను వివరిస్తూ బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓ ఆర్టిస్ట్తో కలిసి పాత విషయాలన్నీ మాట్లాడుకునే వాళ్లం. వేదశాస్త్రాలు, నాన్నగారి డైలాగులు.. ఆ రంగారావు.. అక్కినేని తొక్కినేని ఇలా అన్ని విషయాలు మాట్లాడుకునే వాళ్లం’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.