Zomato: మాంద్యం భయాలు వెంటాడుతుండడంతో దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ట్విట్టర్, అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈక్రమంలో దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థ అమెజాన్ కీలక ప్రకటన చేసింది. కొత్తగా 800 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది.
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఈ విషయాన్ని లింక్డిన్ వేదికగా ప్రకటించారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ టు సీఈవో, గ్రోత్ మేనేజర్, జనరలిస్ట్, ప్రొడక్ట్ ఓనర్, సాప్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ వంటి విభాగాల్లో కొత్త వారిని నియమించుకోనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చని సూచించారు.
అయితే ఇటీవలే జొమాటో తమ మొత్తం ఉద్యోగుల్లో మూడు శాతం మందిని తొలగించింది. తిరిగి ఇప్పుడు మళ్లీ భారీ స్థాయిలో నియామకాలు చేపడుతుండడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.