Mumbai: ఎయిర్పోర్టుల్లో అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. కొత్త దారుల్లో స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. అక్రమంగా కరెన్సీ, బంగారం తీసుకొస్తూ అధికారులకు చిక్కుతున్నారు. ఓ ప్రయాణికుడు పుస్తకాల్లో విదేశీ కరెన్సీ తరలిస్తూ ముంబై ఎయిర్పోర్టుల్లో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు.
అదివారం రాత్రి ముంబై ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ప్రయాణికుడిపై అనుమానం కలిగి అతని బ్యాగ్ను తనిఖీ చేశారు. ప్రయాణికుడు పుస్తకాల మధ్య పేజీలకు డాలర్లను అతికించి తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం 90 వేల డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో వాటి విలువ దాదాపు రూ. 74 లక్షలు.
అయితే ఆ డబ్బుకు సంబంధించి ప్రయాణికుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తనిఖీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Indians: విదేశాలకు క్యూ కడుతున్న భారతీయులు.. దేశాన్ని వీడిన 1.8 కోట్ల మంది
Pak woman: గేమింగ్ యాప్లో ప్రేమాయణం.. దేశం దాటి వచ్చిన యువతి.. చివరికి..