TS:ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒక విడత డీఏ 2.73 శాతం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ దారులకు జనవరి నెల పెన్షన్ తో కలిపి ఫిబ్రవరిలో డీఏ చెల్లించనున్నారు. ఇక పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలను 8 విడతల్లో జీపీఎఫ్ లో జమచేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఉద్యోగులకు సంబంధించి ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను సర్కార్ చకాచకా పరిష్కరిస్తోంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసిన కాసేపటికే ఉద్యోగుల పెండింగ్ డీఏను రిలీజ్ చేస్తూ జీవో జారీ చేసింది.