CHICAGO:చికాగోలో దారుణం జరిగింది. ఇద్దరు తెలుగు విద్యార్థులపై దుండగులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులలో ఒకరు తెలంగాణకు చెందిన చరణ్ గా గుర్తించారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చికాగో సౌత్ ప్రాంతంలో చరణ్, అతని స్నేహితుడిని నలుపు రంగు కారులో వచ్చిన నల్ల జాతీయులు వారిని అటకాయించారు. డబ్బులు ఇవ్వాలంటూ గన్ లతో బెదిరించారు. అంతటితో ఆగకుండా ఇద్దరు విద్యార్థులపై దోపిడి దొంగలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చరణ్ తో పాటు అతని స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.