School: పాఠశాల అనగానే ఉపాధ్యాయులు, టీచర్లతో సందడిగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు ఆడుతూ.. పాడుతూ పాఠాలు నేర్చుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. అయితే మహారాష్ట్రలో ఉన్న ఓ పాఠశాలలో మాత్రం ఒక్కరే విద్యార్థి ఉన్నాడు. అతడి కోసమే ఓ టీచర్ వచ్చి పాఠాలు బోధిస్తున్నారు. ఉన్నది ఒక విద్యార్థి అయినా స్కూల్లో జరగాల్సిన అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి.
వాషిమ్ జిల్లాలోని గణేష్పూర్ గ్రామంలో ఈ స్కూల్ ఉంది. ఆ గ్రామంలో మొత్తం 150 మంది జనాభా ఉన్నప్పటికీ ఈ ఒక్క విద్యార్థి మాత్రమే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాపలలో చదువుకుంటున్నాడు. అతడి కోసం కిషోర్ అనే టీచర్ ప్రతిరోజు స్కూల్కు వచ్చి పాఠాలు చెబుతున్నారు. ఉన్నది ఒక్క విద్యార్థి అయినా ఉదయం జాతీయ గీతం ఆలపించడంతో సహా అన్ని నియమ నిబంధనలు పాటిస్తానని కిషోర్ తెలిపారు. అన్ని సబ్జెక్టులను తానే బోధిస్తానని వెల్లడించారు.