EPAPER

TeamIndia: పంత్ కోలుకోవాలని.. క్రికెటర్ల పూజలు

TeamIndia: పంత్ కోలుకోవాలని.. క్రికెటర్ల పూజలు

TeamIndia: న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. రెండు వన్డేల్లో గెలుపొంది ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం నామమాత్రపు మూడో వన్డే కోసం మధ్యప్రదేశ్‌కు వెళ్లారు. ఈనెల 24న ఇండోర్ వేదికగా మూడో వన్డే జరగనుంది.


ఈక్రమంలో టీమిండియా ఆటగాళ్లు కుల్‌దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు పలువురు ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. పరమశివుడిని దర్శించుకొని భస్మా హారతి సమర్పించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్రికెటర్ రిషభ్ పంత్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు.

రిషభ్ పంత్ జట్టులోకి రావడంతో టీమిండియాకు చాలా ముఖ్యమని సూర్యకుమార్ యాదవ్ అన్నారు. అతడు త్వరగా కోలుకోవాలని పరమశివుడికి ప్రత్యేక పూజలు చేశామని వెల్లడించారు. త్వరలోనే కోలుకొని రిషభ్ జట్టులో చేరుతాడని చెప్పారు.


కాగా, పోయిన ఏడాది డిసెంబర్ 30న రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్ ప్రయాణిస్తున్న కారు డివైఢర్‌ను ఢీ కొట్టింది. ప్రస్తుతం పంత్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పంత్ కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

Iga Swiatek : నెంబర్‌వన్‌కు షాక్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్..

Ronaldo: వంట మనిషి కోసం వెతుకుతున్న రొనాల్డో.. జీతం రూ. 54 లక్షలు!

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×