TeamIndia: న్యూజిలాండ్తో జరుగుతోన్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. రెండు వన్డేల్లో గెలుపొంది ఫుల్ జోష్లో ఉన్నారు. ప్రస్తుతం నామమాత్రపు మూడో వన్డే కోసం మధ్యప్రదేశ్కు వెళ్లారు. ఈనెల 24న ఇండోర్ వేదికగా మూడో వన్డే జరగనుంది.
ఈక్రమంలో టీమిండియా ఆటగాళ్లు కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్తో పాటు పలువురు ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. పరమశివుడిని దర్శించుకొని భస్మా హారతి సమర్పించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్రికెటర్ రిషభ్ పంత్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు.
రిషభ్ పంత్ జట్టులోకి రావడంతో టీమిండియాకు చాలా ముఖ్యమని సూర్యకుమార్ యాదవ్ అన్నారు. అతడు త్వరగా కోలుకోవాలని పరమశివుడికి ప్రత్యేక పూజలు చేశామని వెల్లడించారు. త్వరలోనే కోలుకొని రిషభ్ జట్టులో చేరుతాడని చెప్పారు.
కాగా, పోయిన ఏడాది డిసెంబర్ 30న రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్ ప్రయాణిస్తున్న కారు డివైఢర్ను ఢీ కొట్టింది. ప్రస్తుతం పంత్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పంత్ కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
Iga Swiatek : నెంబర్వన్కు షాక్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్..
Ronaldo: వంట మనిషి కోసం వెతుకుతున్న రొనాల్డో.. జీతం రూ. 54 లక్షలు!