KL Rahul: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి మరికొద్ది గంటల్లో ఒక్కటవ్వబోతున్నారు. నాలుగేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట.. వివాహబంధంలోకి అడుగుపెట్టబోతోంది. ముంబైలోని ఖండాలా ఫామ్హౌస్లో సాయంత్రం 4 గంటలకు వివాహ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ఇరుకుటుంబాల నుంచి కేవలం 100 మంది అతిథులు మాత్రమే హాజరవ్వబోతున్నారట. నటుడు, సల్మాన్ ఖాన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ వేడుకలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇరువురి ఇంట్లో ఈనెల 21 నుంచే పెళ్లి హడావుడి మొదలైంది. 22న ఉదయం మెహందీ ఫంక్షన్.. అదే రోజున సాయంత్రం సంగీత్ను నిర్వహించారు. ఈ వేడుకలో కేఎల్ రాహుల్, అతియా శెట్టితో పాటు ఇరు కుటుంబ సభ్యులు పలు బాలీవుడ్ సాంగ్స్కు స్టెప్పులేసి అలరించారు.
అయితే పెళ్లికి వచ్చే అతిథులకు ఫోన్లు, కెమెరాలు వంటివి తీసుకురావొద్దని చెప్పినట్లు సమాచారం. పెళ్లి జరుగుతున్న సమయంలో ఎటువంటి వీడియోలు, ఫొటోలు తీయొద్దని సూచించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా సెలబ్రెటీలు పెళ్లిళ్లలో నో ఫోన్ పాలసీని పాటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక మేలో ఐపీఎల్ ముగిశాక గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేశారట. ఈ వేడుకలో సినీ, క్రికెట్ ప్రముఖులు దాదాపు 300 మంది పాల్గొననున్నట్లు సమాచారం. ముంబైలో ఈ వేడుకను నిర్వహించనున్నారట. అలాగే బెంగళూరులో మరో వేడుకను కూడా నిర్వహించనున్నట్లు బీటౌన్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.