Nithiin in Anjaneya’s initiation:-హీరో నితిన్ మళ్లీ ఆంజనేయుని దీక్ష చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. అలాగే ఈరోజు హైదరాబాద్ మణి కొండలోని బాబాయ్ హోటల్ను ఆయనే ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం నితిన్ బయటకు వచ్చినప్పుడు విషయం బయటకు తెలిసింది. అంతకు ముందు నితిన్ భీష్మ సినిమా ముందు ఆంజనేయ దీక్షను చేశారు. ఇప్పుడు మళ్లీ దీక్ష చేస్తున్నారు. కాషాయ రంగు బట్టల్లో నితిన్ కనిపించారు. మన హీరోలందర ఇప్పుడు భక్తి బాట పట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ప్రతి ఏడాది అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు.
భీష్మతో బ్లాక్ బస్టర్ సాధించిన నితిన్ తర్వాత చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజక వర్గం సినిమాల్లో నటించారు. అయితే ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో ఆయన కాస్త బ్రేక్ తీసుకుని తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. అందులో భాగంగా.. నితిన్ కాస్త గ్యాప్ తీసుకున్నారు.త్వరలోనే భీష్మ కాంబినేషన్ రిపీట్ అవుతుందనేది సమాచారం. నితిన్, రష్మిక మందన్న జోడీగా వెంకీ కుడుముల దర్శకత్వలో సినిమా తెరకెక్కబోతుందని దాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Follow this link for more updates:- Bigtv