Gujarat: పిల్లలు ప్రేమించుకోవడం.. పెద్దలు నిరాకరించడం అనేది కామన్ అయిపోయింది. ఇటువంటి సంఘటనలు ఎన్నో చూశాం. తల్లిదండ్రులను ఒప్పించలేక కొందరు ప్రేమికులు విడిపోతుంటే.. మరికొందరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువైపోయాయి.
గుజరాత్లోని తాపీ జిల్లాలో పోయిన ఏడాది ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించకపోవడే ఇందుకు కారణం. నెవాలా గ్రామానికి చెందిన గణేష్, రంజన కొంతగా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పోయిన ఏడాది వాళ్ల ప్రేమ వ్యవహారం ఇరువురి ఇంట్లో తెలియడంతో గొడవలు జరిగాయి. ఒప్పించేందుకు వాళ్లు ఎంత ప్రయత్నించినా పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదు.
దీంతో మనస్తానికి గురైన గణేష్, రంజన గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వారి మరణంతో ఇరు కుటుంబాల్లో మార్పు వచ్చింది. దీంతో వాళ్ల చివరి కోరిక తీర్చాలని ఇరుకుటుంబాల వారు నిర్ణయించుకున్నారు. ఏడాది తర్వాత గణేష్, రంజన విగ్రహాలను ఏర్పాటు చేసి వివాహం జరిపించారు. జనవరి 14న గ్రామపెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అయితే బతికి ఉన్నప్పుడే వాళ్ల ప్రేమను అంగీకరిస్తే రెండు ప్రాణాలు నిలిచేవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.