High Court: మహిళలపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దాడులను అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఏ మాత్రం ఆగడం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేటుగాళ్ల చేతిలో అమాయకపు మహిళలు, బాలికలు బలైపోతున్నారు. లైంగిక వేధింపుల కేసులు పెరిగిపోతుండడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాలికలను, మహిళలను అనుమతి లేకుండా తాకకూడదని కోర్టు పేర్కొంది. మర్యాద, సత్ప్రవర్తనలకు సంబంధించిన అంశాలను ప్రాథమిక స్థాయిలోనే పాఠ్యాంశాల్లో భాగం చేయాలని వెల్లడించింది. చిన్న వయస్సులోనే బాలురకు ఈ పాఠాలను నేర్పించాలని సూచించింది. దాని ద్వారా మార్పును తీసుకురావొచ్చని అభిప్రాయపడింది. ఒకసారి అమ్మాయిలు వద్దు అని చెబితే దాని అర్థం వద్దు అని స్పష్టంగా పరుషులు అర్థం చేసుకోవాలని వెల్లడించింది.