Golden chance for Gopichan:- సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. హిట్ ఇచ్చిన డైరెక్టర్కి ఉండే విలువ వేరు. పూల పాన్పుతో స్వాగతం పలుకుతుంది ఇండస్ట్రీ. అదే పరాజయం వస్తే పలకరించేవాడు ఉండడు. ఇప్పుడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని హ్యాపీ మూమెంట్స్ను ఎంజాయ్ చేస్తున్నారు. వీర సింహా రెడ్డి సినిమాతో టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ మలినేని నెక్ట్స్ మూవీ ఎవరితో చేయబోతున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే.. గోపీచంద్ మలినేని నెక్ట్స్ మూవీని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో చేయబోతన్నారని.
ఇదే విషయంపై గోపీచంద్ మలినేనిని అడిగితే ప్రస్తుతం ప్రభాస్తో కథా పరమైన చర్చలు జరుగుతున్నాయని, ఇకా ఫైనలైజ్ కాలేదు కాబట్టి దాని గురించి మాట్లాడలేమని అన్నారు దర్శకుడు. ఒకవేళ ప్రభాస్తో సినిమా ఓకే అయితే మాత్రం నెక్ట్స్ సినిమాకే గోపీచంద్ మలినేని పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడనటంలో సందేహమే లేదు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలను పూర్తి చేసే పేనిలో ఉన్నారు. అలాగే మారుతి సినిమా షూటింగ్ కూడా చక చకా జరుగుతుంది. ఈ సినిమాల తర్వాత సిద్ధార్థ్ ఆనంద్, సందీప్ రెడ్డి వంగా సినిమాలను చేయాల్సి ఉంది. దాని తర్వాత గోపీచంద్ మలినేని సినిమాకు ఓకే చెబుతారు.
Follow this link for more updates:- Bigtv