KANTARA-2: కన్నడ స్టార్ హీరో రిషబ్శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కాంతార’. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవల్లో ఘన విజయం సాధించింది. రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఈ మూవీకి సీక్వెల్గా ‘కాంతార-2’ ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్న సినీ ప్రియులకు మేకర్స్ గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే ‘కాంతార-2’ను తెరకెక్కించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది.
పార్ట్ 2 షూటింగ్ జూన్లో మొదలయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ తెలిపారు. సినిమాలో కొన్ని సీన్స్ వర్షాకాలం నేపథ్యంలో తెరకెక్కించేవి ఉండడంతో.. ఆ నెలలో షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పనులను రిషబ్ శెట్టి మొదలు పెట్టారని వెల్లడించారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్టోరీకి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నారని తెలిపారు. అయితే ఇది కాంతారకు సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని చెప్పారు. పాన్ ఇండియా లెవల్లో 2023 ఏప్రిల్ లేదా మేలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.