IND vs NZ: రాయపూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతోన్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్కు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ ఆటగాళ్లు తట్టుకోలేకపోయారు. 34.3 ఓవర్లలో 108 పరుగులు చేసి కుప్పకూలిపోయారు. దీంతో టీమిండియా టార్గెట్ 109 పరుగులుగా ఉంది.
న్యూజిలాండ్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రాస్వెల్ (22), మిచెల్ శాంటర్న్ (27) పరుగులు చేశారు. షమీ, సిరాజ్కు తోడు ఆల్రౌండర్లు హార్ధిక్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్ వికెట్లు తీయడంతో కివీస్ కష్టాల్లో పడింది. వాషింగ్టన్ సుందర్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి కివీస్ను దెబ్బకొట్టాడు.