Amusement Park: వారం రోజులు ఆఫీస్ వర్క్, వ్యాపారాల్లో బిజీగా ఉండే చాలా మంది సమయం దొరికినప్పుడల్లా పిల్లలు, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇందుకోసం టూరిస్ట్ ప్రాంతాలకు, పార్క్లకు వెళ్తుంటారు. ఇలా ఎంజాయ్ చేద్దామని అమ్యూజ్మెంట్ పార్క్కు వెళ్లిన టూరిస్టులకు ఊహించని షాక్ తగిలింది. పార్క్లో పెండ్యులంపై రైడ్ చేస్తున్న క్రమంలో రాడ్ విరిగిపోయి అంతా తలక్రిందులుగా వేలాడారు. ఈ ఘటన డ్రాగన్ కంట్రీ చైనాలో జరిగింది.
చైనాలోని ఫుయాంగ్ నగరంలోని ఓ అమ్యూజ్మెంట్ పార్క్ను సందర్శించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వెళ్లారు. ఈక్రమంలో కొందరు పర్యాటకులు పెండ్యులం రైడ్ చేస్తుండగా ఒక్కసారిగా మధ్యలో ఉండే పెద్ద రాడ్ విరిగిపోయింది. దీంతో దానిపై ఉన్న టూరిస్టులంతా తలక్రిందులుగా వేలాడారు. దాదాపు 10 నిమిషాల పాటు తలక్రిందులుగానే ఉండి భయంతో అరుపులు, కేకలు పెట్టారు.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. రాడ్ పైభాగానికి వెళ్లి సరిచేయడంతో అందరూ సురక్షితంగా కిందికి దిగారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే పరిమితికి మించి ఎక్కువ మందిని పెండ్యులంపైకి ఎక్కించడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.