EPAPER

Hyderabad: అగ్నిప్రమాదం.. డ్రోన్‌తో రెండు మృతదేహాల గుర్తింపు

Hyderabad: అగ్నిప్రమాదం.. డ్రోన్‌తో రెండు మృతదేహాల గుర్తింపు

Hyderabad: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. భవనంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అధికారులు డ్రోన్ కెమెరాల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి.


గురువారం ఉదయం మంటలు చెలరేగిన వెంటనే ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే బీహార్‌కు చెందిన ముగ్గురు కూలీలు జునైద్, వసీం, జహీర్‌ల ఆచూకీ మాత్రం గల్లంతైంది. అధికారులు వాళ్ల సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ట్రాక్ చేసి మంటలు చెలరేగిన భవనంలో ఉన్నట్లు గుర్తించారు.

భవనం లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా భవనంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భవనంలోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. భవనం కూల్చివేతపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని వివరించారు.


Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×