YouTube: కరోనా లాక్డౌన్ తర్వాత చాలా మంది యూట్యూబ్లో వీడియోలు చేయడం మొదలు పెట్టారు. కొందరు ఇంట్లో ఉంటూ వీడియోలు చేస్తుంటే.. మరికొందరు ప్రపంచ దేశాలు తిరుగుతూ వ్యూవర్లను ఎంటర్టైన్ చేస్తున్నారు. దీని ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు లక్షల్లో సంపాదిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు యూట్యూబ్లో వీడియోలు చేస్తూ వచ్చిన డబ్బులతో ఆడీ కారు కొన్నాడు. ఈ ఘటన బీహార్లో జరిగింది.
ఔరంగాబాద్లోని జసోయా ప్రాంతానికి చెందిన హర్ష్ రాజ్పుత్(27) అనే యువకుడు కరోనా లాక్డౌన్ సమయంలో ధాకడ్ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. తమ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై ఫన్నీ వీడియోలు చేస్తూ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడి ఛానెల్కు 33 లక్షల మంది సబ్స్రైబర్లు ఉండగా.. నెలకు దాదాపు రూ. 8 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఇటీవల యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో రూ. 50 లక్షలు పెట్టి ఖరీదైన ఆడీ కారును కొనుగోలు చేశాడు.