Nithya Menen: కన్నడ భామ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. అటు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్కు మరింత దగ్గరవుతుంది. తాజాగా ఆమె టీచర్గా మారింది. ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
నిత్యామీనన్ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ కృష్ణాపురం అనే గ్రామంలో జరిగింది. అయితే షూటింగ్ అయిపోగానే ఆపక్కనే ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన నిత్యామీనన్ తరగతి గదిలో విద్యార్థులతో సరదాగా ముచ్చటించింది. ఆ తర్వాత స్టూడెంట్స్కు ఆంగ్ల పాఠాలు బోధించి.. వారికి అర్థమయ్యేలా వాటిని తెలుగులోనూ వివరించింది.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది నిత్యామీనన్. ‘విద్యార్థులను కలిసినప్పుడు ఎంతో సంతోషం కలిగింది. గ్రామాల్లో ఉండే చిన్నారులు బాల్యాన్ని ఎంతో ఆనందంతో గడుపుతారు’ అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.