Ranganatha Swamy Temple:- మేడ్చల్ జిల్లా ఘటకేసర మండలం లో ఏదులాబాద్ గ్రామంలో గోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం ఫేమస్.. సికింద్రాబాద్ కి సుమారు 30 కి మీ దూరంని లో వెలసిన క్షేత్రం గోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం. సుమారు 500 ఏళ్ల చరిత్ర ఈగుడికి ఉంది. అందమైన రాజ గోపురం , గోపురం పైన రక రకాల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఆలయ ఆవరణంలో పుష్కరిణిలో స్నానం ఆచరించిన తర్వాతే భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు. వైష్ణవ సంప్రదాయం ప్రాకారం ఇక్కడ పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
ఏదులాబాద్ కి పూర్వం రాయపురం అని పేరుండేది. .అప్పన దేసిక చారి అనే బ్రాహ్మణుడు ఈ క్షేత్రాన్ని లో ఉండేవాడట . ఒక మహర్షి మంత్రోపదేశంతో మదురై సమీపంలో ఉన్న లిల్లి పొత్తుర్ లో గోదాదేవి ఆలయాన్ని దర్శించుకున్నాడట. అప్పుడు గోదాదేవి అమ్మ వారు కలలో దర్శనం ఇచ్చి తనను రాయపురం తీసుకుని వెళ్ళమని చెప్పిందట. అలా దొరికిన విగ్రహాన్ని తీసుకోని వచ్చి గ్రామస్తుల సహాయం తో ఈ దేవాలయాన్ని నిర్మించారు అని స్థల పురాణం చెబుతోంది. ఇప్పటికి ఈ దేవాలయం లో ఆ వంశస్తులు ఈ దేవాలయానికి పూజ కార్యక్రామాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతమంత చెట్లు ,గుట్టలు పుట్టలతో నిండి ఉండేది. గరుడ పక్షుల సంచారం కూడా ఈ ప్రాంతం లో ఉండేది. అందుకే దీనికి గరుడాద్రి అని కూడా పిలుస్తారు.
గోదాదేవి అమ్మవారిని గాజుల అండాలమ్మ అని పిలుస్తారట . ఒకసారి అమ్మ వారు ఉత్సవాల సమయం లో ఒక గాజుల దుకాణానికి వెళ్లి గాజులు వేసుకొని డబ్బులు నాన్న గారు ఇస్తారు అని చెప్పి వెళ్ళిపోయిందట. దుకాణం యజమాని ఆలయ అధికారిని అడగగా తనకు కుతూళ్లు లేరని చెప్పాడట. ఆ తరువాత ఆలయం లోకి వెళ్లి చూడగా గాజులు అమ్మ వారి చేతికి ఉన్నాయి అట .అందుకీ అప్పట్నుంచి ఇక్కడ ఉన్న అమ్మవార్ని గాజుల అండాలమ్మ అని కూడా పిలుస్తారు . అప్పట్నుంచి గ్రామస్థులు అమ్మవారిని ఇంటి అడపడుచుగా భావించి ఒడిబియ్యం పోస్తూ ఉండటం ఇక్కడ ఆచారం. ఆలయం లో అమ్మవారిని దర్శించి కోరికలు కోరుకుంటే గోదాదేవి తప్పకుండ నెరవేరుస్తుంది అని భక్తుల భక్తుల ప్రాగడ విశ్వాసం. బ్రహ్మోత్సవాలు గోదాదేవి కల్యాణం ఘనంగా జరుగుతాయి
Follow this link for more updates:- Bigtv