Surya Devara Naga Vamsi : సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై టాలీవుడ్లో చిన్న, మీడియం, భీమ్లా నాయక్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న వ్యక్తి సూర్య దేవర నాగ వంశీ. ఇప్పుడు కూడా ‘బుట్ట బొమ్మ’ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 26న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సమయంలో ఆయన ఆఫీసుపై ఐటీ అధికారులు దాడి చేశారు. షూటింగ్ లొకేషన్లో ఉన్న ఆయన్ని కలిసిన ఐటీ అధికారులు ఆఫీసుకి తీసుకెళ్లి.. చెక్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్ ఆఫీసుతో పాటు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలైన మై హోమ్స్, ఫీనిక్స్ వంటి వాటిలో సోదాలు నిర్వహించినటప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ పేరు బయటకు వచ్చిందని, అందువల్ల. సూర్య దేవర నాగ వంశీ ఆఫీసుపై కూడా దాడులు జరిగాయనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై సూర్య దేవర నాగ వంశీ ఎలా రియాకట్్ అవుతారో చూడాలి.
Follow this link for more updates:- Bigtv