Kejriwal: ఖమ్మం బీఆర్ఎస్ సభలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతో నేర్చుకున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం, సమీకృత కలెక్టరేట్ల కాన్సెప్ట్ అద్భుతమని కొనియాడారు. కంటి వెలుగు పథకాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ప్రకటించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నియమించిన గవర్నర్లు రాజకీయం చేస్తూ అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. మోదీ ఆడించినట్లు గవర్నర్లు ఆడుతున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతామని వెల్లడించారు.