Akhilesh: బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిందని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఖమ్మంలో జరుగుతోన్న బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రశ్నించిన విపక్ష నేతలపై బీజేపీ సీబీఐతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. అలాగే తమకు నచ్చని ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. రైతులకు సరైన మద్ధతు ధర ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని విమర్శించారు.
బీజేపీని గద్దె దింపేందుకు కేసీఆర్ చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖమ్మం సభ నుంచి దేశానికి మంచి సందేశం ఇస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు. తెలంగాణలో ఇంటింటా తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందుతోందని చెప్పారు.