Vijayan:కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధ్వజమెత్తారు. దేశంలో ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజాసమస్యలను పక్కన బెట్టి.. మోదీ కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు దేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఖమ్మం బీఆర్ఎస్ సభ దేశానికి ఓ దిక్సూచి లాంటిదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని తెలిపారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. కంటి వెలుగు అద్భుతమైన పథకం అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను కేరళలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించడం అభినందనీయం అన్నారు. ఈ యుద్ధానికి తమ మద్ధతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.