Shaakuntalam:- సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ శాకుంతలం. త్రీడీ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా గుణ శేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఫిబ్రవరి 17న ఈ సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్గానే టీజర్ను రిలీజ్ చేసిన ప్రమోషన్స్ను స్టార్ట్ చేసిన దర్శక నిర్మాతలు ఇప్పుడు ప్రమోషన్స్లో స్పీడు పెంచారు. అందులో బాగంగా జనవరి 18న మల్లిక అనే పాటను విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. ఇక సినిమా రిలీజ్కు నెల రోజులు మాత్రమే ఉంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ను పాన్ ఇండియా రేంజ్లో గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు.
కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలం సినిమాను దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించారు. శకుంతలగా సమంత నటిస్తే.. దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించారు. చిన్ననాటి భరతుడు పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించటం కొస మెరుపు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి ప్లాన్స్ చక చకా జరిగిపోతున్నాయి.
Follow this link for more updates:- Bigtv