Lalit Modi: లలిత్ మోదీ తెలుసుగా. ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్. ఆ తర్వాత పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసుతో ఇండియా నుంచి పారిపోయాడు. 2010 నుంచి లండన్ లో ఉంటున్నాడు. మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తో కలిసి ఉంటున్నాడు. ఇంకా పెళ్లి చేసుకోలే.. డేటింగ్ ఓన్లీ. ఆ లలిత్ మోదీ ఇప్పుడు లండన్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ కేర్ లో ఉన్నాడు.
లలిత్ మోదీ రెండువారాల్లో రెండుసార్లు కరోనా బారిన పడ్డారు. న్యూమోనియా కూడా సోకింది. పల్స్ రేట్, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి. వెంటనే ఎయిర్ అంబులెన్స్ లో లండన్ లోని ఓ టాప్ హాస్పిటల్ లో చేరారు. ఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతోు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
ఈ వివరాలన్నీ తెలుపుతో ఆయనో సెల్ఫీ వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఆస్పత్రి బెడ్ పై తానున్న ఫోటోలు షేర్ చేశారు. లలిత్ మెదీ త్వరగా కోలుకోవాలని పలువురు క్రికెటర్లు కామెంట్లు పెడుతున్నారు. మరి, సుస్మితాసేన్ పరిస్థితేంటి? అంటూ కొందరు నెటిజన్లు టీజ్ చేస్తున్నారు.