Sankranti Pooja:సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజునే సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటాం. ఈ రోజు ఇంటిల్లిపాదీ ఉదయమే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని మామిడి తోరణాలు కట్టుకోవాలి. అనంతరం నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని, సున్ని పిండి, కుంకుడు రసంతో తలస్నానం చేయాలి. అవకాశం ఉన్నవారు తప్పక నదీ స్నానం చేయాలి. తర్వాత కొత్త బట్టలు ధరించి ఇష్టదేవతలను, కులదేవతలను, గ్రామదేవతలను స్మరించి పూజించాలి. పూజ అనంతరం తల్లిదండ్రులు లేనివారు తప్పక తమ పితృదేవతలను ఆరాధించి వారికి తర్పణాలు వదలాలి.
సంక్రాంతి రోజున సాయంత్రం సదాశివుడికి ఆవునెయ్యితో అభిషేకం చేయడం, పరమశివుడి క్షేత్రంలో నువ్వుల నూనెతో దీపం పెట్టడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఉదయాన్నే తలస్నానం చేసి సూర్య నమస్కారం చేయడం వల్ల, లక్ష్మీనారాయణులను పూజించాలి. సాయంత్రం సదాశివుడిని ఆవునెయ్యితో అభిషేకించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి. సూర్యుడు శ్రీమన్నారాయముడని, విష్ణుమూర్తిగానూ పూజలందుకుంటున్నాడు. న నారాయణుడిని, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. సంక్రాంతి రోజున ప్రదోష వేళలో పరమశివుడిని ఆరాధించడం ద్వారా అనేక శుభాలు లభిస్తాయి