Munugode : ఓపైపు మునుగోడు బైఎలక్షన్స్.. మరోవైపు రాహుల్ భారత్ జోడో యాత్ర. ఈ రెండూ ఒకేసారి సమన్వయం చేసి గెలుపును మరింత సునాయాసం చేసుకొనే దిశగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమాయత్తం అవుతన్నారు. టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం మునుగోడు ప్రచారంలో బిజీగా ఉన్నారు. నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నికలు జరుగనున్నాయి. అటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 23 నుంచి నవంబర్ 13 వరకు తెలంగాణలో కొనసాగనుంది. అయితే రాహుల్ జోడో యాత్రను మునుగోడు నుంచే మొదలుపెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెళ్లడించాయి.
ఇప్పటికే రాహుల్ గాంధీకి జోడోయాత్రలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. తమిళనాడు, కేరళ, కర్నాటకలో రాహుల్కు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. యువత, పిల్లలు, మహిళలు రాహుల్తో సెల్ఫీ దిగేందుకు పోటీపడుతున్నారు. జోడో యాత్ర రాహుల్ పొలిటికల్ కెరీర్కు మంచి బూస్ట్ ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మునుగోడు నుంచి తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ప్రారంభమవుతే.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు.. మునుగోడు కాంగ్రెస్ జెండా మళ్లీ రెపరెపలాడ్డానికి మరింత దోహదం చేస్తున్నట్లు పలువురు అభిప్రయాపడుతున్నారు.