Renuka Choudhary : జాతీయస్థాయిలో రెండు సార్లు ఓడిపోయాం.. అది తమ స్వయంకృతమని, అందుకు లెంపలేసుకుని ప్రజల్లోకి వచ్చామన్నారు కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి. ఖమ్మం జిల్లా ప్రజానికానికి సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతే అడుగుపెట్టాలని అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ స్దానాలతో పాటు మొత్తం అసెంబ్లీ స్థానాలను సైతం గెలుచుకుంటామని రేణుకా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ కి అడ్రెస్సే లేదంటూ.. దేశంలో చరిత్ర హీనులుగా మిగిలిపోయిన నేతలు ఇవాళ కథలు అల్లుతున్నారని మండిపడ్డారు. ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక త్యాగాలు చేస్తూ వచ్చిందన్నారు.
ప్రధాని మోదీకి సవాల్ విసురుతున్నానంటూ.. ఈ దేశానికి బీజేపీ ఏం అభివృద్ది చేసింది ఏ మార్గాన తీసుకు వెళ్తున్నారో చెప్పాలని.. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత మేర మేలు చేసిందో తాను చెబుతానన్నారు.
ఖమ్మం కాంగ్రెస్ జిల్లా.. అది తమకే సొంతం అన్నారు. ఖమ్మం ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. జాతీయస్థాయిలో రెండు సార్లు ఓడిపోయామని.. అది తమ స్వయంకృతమని, అందుకు చెంపలేసుకుని ప్రజల్లోకి వచ్చామన్నారు రేణుకా చౌదరి.