Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయాలపైనే ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చ జరుగుతోంది. నవంబర్ 3న అందేరి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. బీజేపీ, ఉద్ధవ్ థాక్రే వర్గం నువ్వా నేనా అనే తరహాలో ఈ అసెంబ్లీ స్థానంలో పోటీకి దిగుతున్నాయి. శివసేన ప్రభుత్వంపై ఏక్నాధ్ శిండే వర్గం తిరగబడిన తరువాత జరుగుతన్న మొదటి ఉప్ప ఎన్నిక ఇదే. దీంతో ఫలితం ఎలా రాబోతోందన్నదానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది.
శివసేన 55 ఎమ్మెల్యేల నుంచి 40 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకొని ఏక్నాథ్ శిండే తిరగబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరుగనున్న ఉపఎన్నికలు బీజేపీ ఏక్నాథ్ శిండే వర్గానికి, ఉద్ధవ్ థాక్రే వర్గానికి పెద్ద చాలెంజ్గా ముందుంది. ఈస్ట్ అందేరీ అసెంబ్లీ స్థానంలో బీజేపీ, ఏక్నాధ్శిండే తరపున ముర్జి పటేల్ నిలుచున్నాడు. కాంగ్రెస్, ఎన్సీపీ, లెఫ్ట్ కలిసి తరపున రుతుజ లట్కే పోటీ చేస్తున్నాడు. ఈ అసెంబ్లీ