Nayanthara:మనిషి అందంగా ఉంటేనే సరిపోదు.. మనసు అందంగా ఉండాలి. అలాంటి వారిని చూస్తే ఓ మనసులో తెలియని ఓ డివైన్ ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులను చూస్తే అదే అనిపిస్తుంది. గత ఏడాదిలో పెళ్లి చేసుకున్న వారు.. సరోగసీ ఇద్దరి పిల్లలకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటున్న నయనతార.. మరో వైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా మారారు. ఫ్యామిలీ, సినిమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను వారిద్దరూ షేర్ చేస్తున్నారు. తాజాగా నయనతార తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె, తన భర్త విఘ్నేష్ శివన్తో కలిసి చెన్నైలోని స్ట్రీట్ చిల్డ్రన్కు న్యూ ఇయర్ గిఫ్ట్స్ను ప్రెజంట్ చేసింది. అది కూడా రాత్రి సమయంలో కాదండోయ్.. పగటి సమయంలో.
ఆ వీడియో చూసిన నెటిజన్స్ నయనతారను, విఘ్నేష్ శివన్ మంచి మనసులను అప్రిషియేట్ చేస్తున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో నయనతార దంపతులు మంచి పని చేశారంటూ ఫాలోవర్స్ నెటిజన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత నయనతార సినిమాల్లో నటిస్తుంది. గాడ్ ఫాదర్, కనెక్ట్ వంటి చిత్రాలతో ఆమె సిల్వర్ స్క్రీన్పై మెప్పించింది. ఇప్పుడు షారూఖ్ ఖాన్తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తుంది నయనతార.