రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న మధ్య ఏదో నడుస్తుందని మీడియా అంతా కోడై కూస్తుంది. రీసెంట్గా వారిద్దరూ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇవేనంటూ కొన్ని పిక్చర్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు రెండు సినిమాలు చేశారు. అందులో మొదటిది గీత గోవిందం.. రెండో సినిమా డియర్ కామ్రేడ్. ఈ రెండు చిత్రాల్లో గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో ఏకంగా వంద కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.
ఇక రెండో సినిమా డియర్ కామ్రేడ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీని తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే బావుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇదే విషయంపై రష్మిక మందన్న కూడా రియాక్ట్ అయ్యింది. ‘‘నేను , విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేయాలనుంది. మా ఇద్దరినీ కలిసి స్క్రీన్పై చూడాలనుందని చాలా మంది మెసేజ్లు పెట్టారు. మేము కూడా కలిసి పని చేయాలని అనుకుంటున్నాం. అయితే మంచి స్క్రిప్ట్ దొరకాలి. ఇద్దరికీ సరిపడే స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. విజయ్తో వర్క్ చేయటాన్ని ఇష్టపడతాను’’ అన్నారు.