EPAPER
Kirrak Couples Episode 1

Jagan : సీఎం జగన్‌ సభ వద్ద ప్రమాదం.. వృద్ధురాలికి తీవ్రగాయాలు..

Jagan : సీఎం జగన్‌ సభ వద్ద ప్రమాదం.. వృద్ధురాలికి తీవ్రగాయాలు..

Jagan : ఏపీ సీఎం జగన్‌ రాజమండ్రిలో పాల్గొన్న సభ వద్ద ఓ వృద్ధురాలు ప్రమాదానికి గురయ్యారు. సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె బస్సు దిగే క్రమంలో పడిపోయారు. ఆమె దిగక ముందే బస్సు ఒక్కసారిగా కదలడంతో ఈ ప్రమాదం జరిగింది.


పింఛన్ల పెంపు వారోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలో సీఎం జగన్ కార్యక్రమం నిర్వహించారు. పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సభకు అర్జి పార్వతి (70) అనే వృద్ధురాలు వచ్చారు. సభాస్థలి వద్ద దిగుతుండగా బస్సు కదలడంతో ఆమె కిందపడిపోయారు. అదే సమయంలో పక్కనుంచి వెళ్తున్న మరో వాహనం వృద్ధురాలి కాళ్ల పైనుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో పార్వతి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బాధితురాలని ఆస్పత్రికి తరలించారు.

ఏపీలో రాజకీయ పార్టీల సభలు రక్తాన్ని చిందిస్తున్నాయి. కందుకూరు, గుంటూరులో టీడీపీ సభల్లో జరిగిన తొక్కిసలాటలు మొత్తం 11 మందిని బలితీసుకున్నాయి. ఈ దుర్ఘటనలో గాయపడ్డ అనేక మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు వైసీపీ సభ వద్ద ప్రమాదం జరగడం రాజకీయ పార్టీల కార్యక్రమాల నిర్వహణలో వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి. కందుకూరు, గుంటూరు ఘటనలపై వైసీపీ చంద్రబాబు నిందిస్తూ విమర్శలు చేసింది. అటు టీడీపీ ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగాయని ఎదురుదాడి చేసింది. తాజాగా రాజమండ్రిలో జరిగిన ప్రమాదంపై ఈ రెండు పార్టీల మధ్య వార్ మరింత ముదరే అవకాశం ఉంది.


Related News

BjP vs DMK: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. భగ్గుమన్న దగ్గుబాటి పురంధేశ్వరి

Tirumala Laddu: లడ్డూ వివాదంతో శ్రీవారి ప్రతిష్ట మసకబారిందా? భక్తుల మనస్సులో లక్ష ప్రశ్నలు

Investments In AP: ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీకి రాక.. వైజాగ్ లో లుల్లు మాల్.. యువతకు ఉపాధి మెండు

AP Politics: ముప్పేట దాడి.. వైయస్ జగన్ తట్టుకొనేనా.. వైసీపీకి గడ్డు కాలమేనా..

Pawan Kalyan : దేవాలయాలకు అసలైన అర్థం ఇదే.. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్

Tirumala Laddu: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

Naga Babu : పెద్దల సభకు మెగా బ్రదర్ నాగబాబు ? అదే జరిగితే చిరు తర్వాత నాగబాబే !

Big Stories

×