CP CV ANAND : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై (Phone Tapping Case) హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు.
అందులో వాస్తవం లేదు…
ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు భారత్కి తిరిగి వచ్చాడని అంటున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. ఈ మేరకు ఫోన్ టైపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఆయనపై లుక్ నోటీస్ ఉంది…
ఇప్పటికే ప్రభాకర్ రావు పై లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేశామని, ఫలితంగా దేశంలో ఎక్కడ విమానాశ్రయంలో ప్రభాకర్ రావు దిగినా తమకు సమాచారం వస్తుందన్నారు.
అన్ని ఎయిర్ పోర్టుల్లో అలెర్ట్…
భారత్కి ఎప్పుడు వస్తే అప్పుడే అరెస్ట్ చేస్తామన్నారు. ఎయిర్పోర్టులో అడుగుపెట్టిన వెంటనే సిట్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తారన్నారు. మరోవైపు ఆయన అనారోగ్యం బారిన పడ్డారని, దీంతో వీసా గడువును ఇంకొన్నాళ్లు పెంచుకునేందుకే యత్నిస్తున్నట్లు సమాచారం.
Also Read : వైసీపీ కొత్త ప్రచారం.. ఏ క్షణమైనా బెయిల్ రద్దు, టెన్షన్లో జగన్ !