KTR Vs Konda Surekha : కేటీఆర్ పిటిషన్పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం కేసు వేయగా.. ఈ పిటిషన్పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధిన వీడియోలను కూడా సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఈ నెల 27 వరకు వాయిదా కోర్టు వేసింది.
మంత్రి కొండా సురేఖ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ మేరకు కొండా సురేఖకు మొట్టికాయలు వేసింది. అంతే కాకుండా కేటీఆర్ పై మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపింది.
కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కోర్టు తప్పుబట్టింది. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా కేటీఆర్పై మంత్రి చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, వెబ్ సైట్లు, మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన , కథనాలను ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలిచ్చింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపుతాయని కోర్టు అభిప్రాయపడింది.