Mahabharatam : కర్నాటకలోని కురుడుమలోని శక్తి గణపతి 14 అడుగుల భారీ విగ్రహం, ఏక సాలగ్రామ శిల. త్రిమూర్తులు ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని ప్రతీతి. ఆర్కియాలజీ నిపుణులు ఈ గుడి సుమారు 2000 ఏళ్ళ క్రితం నాటిదని చెబుతారు. ఈ గుడి మొత్తం ఏక శిలతో నిర్మించడం విశేషం. త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్య విఘ్నాలు తొలగించుకున్నారట., త్రేతాయుగంలో ఈ స్వామిని సేవించి రాముడు లంకకు పయనమయ్యాడని, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఈఆలయానికి వచ్చి స్వామిని సేవించాలని స్థల పురాణం. చెబుతోంది.బెంగళూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ముళబాగిలుకు దగ్గరలో ఈ ఆలయం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు వారికి స్వామి కలలో కనబడి ఆ గుడికి ప్రాకారం నిర్మించమని ఆదేశించడం వలన ఆయన కట్టించారని అక్కడ శిలాశాసనం ద్వారా తెలుస్తోంది.
కౌండిన్య మహాముని ఆ ప్రాంతంలో నేటికీ ఉంటారని, ప్రతీ రాత్రి వచ్చి స్వామిని సేవించుకుంటారని అక్కడ నమ్మకం. దానికి ఆధారంగా కొన్ని రాత్రులు అక్కడ స్తోత్రాలు వినబడతాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని పర్వదినాలలో దేవతలు స్వామిని సేవించుకుంటారు అని అక్కడ పెద్దలు చెబుతారు. అనుకున్న పనులు జరగక విఘ్నాలు విసిగిస్తుంటే స్వామి దర్శనం చేసుకుంటే ఆ అడ్డంకులు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అక్కడ ఉన్న శక్తి మనకున్న దోషాలను, అరిష్టాలను పోగొడుతుంది. ఈ గుడికి ఒక వంద మీటర్ల దూరంలో కౌండిన్య మహర్షి ప్రతిష్టితమైన సోమేశ్వరస్వామి, అమ్మవారిని కూడా దర్శించి వారి అనుగ్రహం పొందవచ్చు.