YSRCP On TDP Drugs Mafia: పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది వైసీపీ చేష్టలు. టీడీపీ బిగ్ బ్రేకింగ్ అంటూ ప్రకటించిన కొద్దిసేపటికే, ఆ థీమ్ని కాపీ కొట్టేసింది వైసీపీ. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆ విషయాన్ని రివీల్ చేసింది వైసీపీ. తీరా వైసీపీ పెట్టిన బిగ్ రివీల్ చూసిన తర్వాత తుస్సు మంది.. కార్యకర్తలను ఉసూరు మనిపించింది.
అధికారంలో ఉన్నవారి దగ్గర ఎంతో కొంత సమాచారం ఉంటుంది. టీడీపీ దగ్గరున్న సమాచారం మేరకు.. బుధవారం రాత్రి ఎనిమిదన్నర గంటలకు వైఎస్ షర్మిల.. జగన్కు రాసిన లేఖను బయటపెట్టింది. ఒక విధంగా అదొక సంచలనం. అంతర్గతంగా ఏం జరిగింది? వైఎస్ఆర్ ఆస్తుల పంపకాల విషయంలో జరుగుతోందన్నది ఆ లేఖ ద్వారానే బయట ప్రపంచానికి తెలిసింది.
వైసీపీ బిగ్ రివీల్ విషయానికొద్దాం. అంతా గాసిప్స్ మాదిరిగా వెల్లడించింది. తాము ఇచ్చిన సమాచారం వంద శాతం కరెక్ట్ అని చెప్పలేకపోయింది. చాలా వరకు వాటిని బ్లర్ చేసింది. మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియా నడిపే వారికి టీటీడీ ఛైర్మన్ పదవులా అంటూ ప్రశ్నించింది.
కొన్నాళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్గా వ్యవహారాలు నడుపుతున్నారని, దాని వెనుక ఎల్లో న్యూస్ ఛానెల్ అధినేత అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. క్లారిటీ లేకుండా బిగ్ రివీల్ అంటూ చెప్పుకోవడం దేనికంటూ అప్పుడే సోషల్ మీడియాలో వైసీపీపై కౌంటర్లు పడిపోతున్నాయి.
ALSO READ: విజయనగరంలో జగన్, డయేరియా బాధితులకు పరామర్శ
ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో పరువు నష్ట దావా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ.. డ్రగ్స్కు సంబంధించిన ఆయా వ్యక్తుల పేర్లు బయట పెట్టలేదని కొందరు అంటున్నారు. వైసీపీ హయాంలో విశాఖ పోర్టులో కంటెయినర్ల వ్యవహారం బయటపడింది. దాని సమాచారం ఏందన్నది కొందరి ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. బిగ్ రివీల్ ఏమోగానీ.. వైసీపీ దీంతో మరింత చులకనైపోయిందనే టాక్ జోరుగా సాగుతోంది.
💣 Exposed 💣
మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?
గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!#YellowMediaDrugsMafia pic.twitter.com/1TDPqGtjsS
— YSR Congress Party (@YSRCParty) October 24, 2024