YS Jagan Vizianagaram Visit: విజయనగరం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. డయేరియాతో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ వ్యవహారం ఏపీ అంతటా సంచలనంగా మారింది. దీనిపై వైసీపీ అలర్ట్ అయ్యింది. బాధితులను పరామర్శించారు ఆయన.
జనంలోకి వెళ్లడం మొదలుపెట్టారు మాజీ సీఎం జగన్. బుధవారం గుంటూరు వెళ్లగా.. గురువారం విజయనగరం టూరేశారు. రీసెంట్గా విజయనగరం జిల్లా గుర్ల ప్రాంతంలో డయేరియా సోకి పలువురు మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. అసలేం జరిగిందని బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారిని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
ALSO READ: బాస్ ఈజ్ బ్యాక్.. విశాఖలో సాయిరెడ్డి మకాం, అలర్టయిన మరో వర్గం
డయేరియా సోకి మరణించిన కుటుంబాలు చాలా వరకు పేదరికంలో ఉన్నారు. తమకు ఆర్థిక సాయం చేయాలని పలువురు మాజీ సీఎంను కోరారు. బుధవారం మీడియాతో మాట్లాడిన జగన్, కూటమి ప్రభుత్వంలోని బాధితులైన సహానా కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సాయం చేశారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే గుర్ల ప్రాంతానికి సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. పార్టీ పరంగా మరణించిన కుటుంబాలకు లక్ష ఆర్థికసాయం చేస్తానని ప్రకటించారు. మరి జగన్ ఇవ్వబోయే సాయం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను మించే ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.