Vijaysai Reddy: వైసీపీ ఉత్తరాంధ్రకు కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి టార్గెట్ ఏంటి? విశాఖకు మకాం ఎప్పుడు మార్చుతున్నారు? సాయిరెడ్డి రాకతో ఆయన ప్రత్యర్థి గ్రూప్ అలర్ట్ అయ్యిందా? ఆయనెందుకు ఆమరణ దీక్షకు దిగుతామన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
చాన్నాళ్ల తర్వాత విశాఖలో అడుగుపెట్టారు వైసీపీ ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి. ఎయిర్పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి.. కొన్ని విషయాలు బయటపెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలపై దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. అక్కడక్కడ దాడులు కొనసాగుతున్నాయని వివరించారు. దీపావళి తర్వాత విశాఖలో మకాం పెడుతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.
విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయ సాయి రెడ్డి..
ఘన స్వాగతం పలికిన వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వైఎస్ఆర్సిపి వ్యతిరేకం.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం.
ప్రైవేటీకరణ జరగకుండా… pic.twitter.com/e0NZI9Mkz7— ChotaNews (@ChotaNewsTelugu) October 24, 2024