Teacher Posts : సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ 2023-24 విద్యా సంవత్సరానికి 63 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 15, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 25, ప్రైమరీ టీచర్ పోస్టులు 23 ఉన్నాయి. అభ్యర్థులు డిగ్రీ లేదా పీజీ చదివి ఉండాలి. దీంతోపాటు బీఈడీ/ బీఈఎల్ఈడీ/ డీఈఎల్ఈడీ చేసి ఉండాలి. అలాగే సీటెట్/ టెట్ లో అర్హత సాధించాలి. ఆసక్తిగల అభ్యర్థులు 2023 జనవరి 30లోపు దరఖాస్తులను పంపించాలి.
మొత్తం టీచర్ పోస్టులు : 63
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు : 15
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు : 25
ప్రైమరీ టీచర్ పోస్టులు : 23
సబ్జెక్టులు : గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, హోమ్ సైన్స్
సైకాలజీ, పెయింటింగ్/ ఫైన్ ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, డ్యాన్స్
హిందీ, సంస్కృతం.
అర్హత : డిగ్రీ/ పీజీ, బీఈడీ/ బీఈఎల్ఈడీ/ డీఈఎల్ఈడీ, సీటెట్/ టెట్
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ : 30-01-2023
వెబ్సైట్: https://www.apsbolarum.edu.in/index.html