EPAPER

India China Border Deal: ఆర్ధికంగా నలిగిపోతున్న చైనా.. ఆ ఒప్పందం వెనుక భయంకర నిజాలు

India China Border Deal: ఆర్ధికంగా నలిగిపోతున్న చైనా.. ఆ ఒప్పందం వెనుక భయంకర నిజాలు

India China Border Deal: నాలుగేళ్ల ప్రతిష్టంభన ముగిసింది. భారత్ చైనాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఎల్‌ఏసీ‌లో ఇరు సైన్యాల మధ్య ఇకపై ఘర్షణలు ఉండవనే ఆశ మళ్లీ మొగ్గతొడిగింది. భారత్, చైనా రైవల్రీ ఆటలో హాల్ట్ రావడంతో రెండు దేశాల మధ్య వాతావరణం చల్లారిందనే సూచనలు కనిపిస్తున్నాయి. 40 మంది ప్రాణాలు తీసిన నాలుగేళ్ల నాటి ఘర్షణకు తర్వాత ఇది ఇరు దేశాల సంబంధంలో కీలక ముందుడుగేనని చెప్పాలి. అయితే, భారత్ చైనాల మధ్య జరిగిన ఒప్పందం ఏంటీ..? ఈ అగ్రిమెంట్‌కి అర్థం ఏంటీ..? జిత్తుల మారి చైనాను నమ్మొచ్చా..? ఒప్పందం ప్రకారం పద్ధతిగా ఉంటుందా..?


రెండు బలమైన దేశాల మధ్య కీలక ఒప్పందం

ఈ పరిణామం భారత్-చైనా సైనికులకు కాస్త ఊరటినిస్తుందనే ఆశించాలి. అంతకుమించి, రెండు అణ్వాయుధ దేశాల మధ్య సయోధ్యకు సంకేతంగానే భావించాలి. గత నాలుగేళ్లుగా వాస్తవాధీన రేఖ వెంబడి సాగుతున్న వివాదాలను ఈ ఒప్పందం పరిష్కరిస్తుంది. ఆ దిశగా దీన్నొక కీలక ముందడుగుగా చూడాలి. అయితే, ఇక్కొడొక డౌట్.. జిత్తుల మారి చైనాను నమ్మొచ్చా? అంతర్జాతీయ వేదికలపై షేక్ హ్యాండ్ ఇచ్చినా.. బ్యాక్ గ్రౌండ్‌లో హ్యాండ్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకవైపు స్నేహ హస్తం చూపిస్తున్నట్లే చూపించి, మరో చేత్తో గన్ గురిపెట్టే బుద్ది చైనాది. అందుకే, ఇప్పుడు ఈ అనుమానాలు. 1962లో జరిగిన భారత్ చైనా యుద్ధం తర్వాత చైనా ఓవరాక్షన్ చాలా సార్లు హద్దు మీరింది. 1975 నుండీ సరిహద్దులో ఎన్నో సార్లు ఆక్రమణలకు పాల్పడింది. భారత్ సహనాన్ని అవకాశంగా తీసుకొని రెచ్చిపోయింది. అయితే, నాలుగేళ్ల క్రితం 40 మందిని బలితీసుకున్న గాల్వాన్ లోయ ఘర్షణలతో అది పీక్స్‌కెళ్లింది. కట్ చేస్తే.. ఇప్పడు, రెండు దేశాలూ ‘బోర్డర్ పెట్రోల్ ఒప్పందానికి’ వచ్చాయి.


ఎల్ఏసీలో సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించే ఒప్పందం

అక్టోబర్ 22 నుండి 24 వరకూ రష్యాలో బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌లు మాట్లాడుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. నాలుగేళ్లుగా తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించే ప్రయత్నాలలో ఈ ఒప్పందం కీలకమైన పురోగతిగా కనిపిస్తోంది. ఈ ఒప్పందంతో.. భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖలో పెట్రోలింగ్ నిర్వహించే హక్కులను పునరుద్ధరించడానికి రెండు దేశాలూ అంగీకరించాయి. దీనితో, లడఖ్‌కు ఉత్తరాన ఉన్న డెప్సాంగ్ మైదానాలు, దక్షిణాన డెమ్‌చోక్ ఎల్‌ఎసి వెంబడి, పాత పెట్రోలింగ్ పాయింట్ల వరకు పెట్రోలింగ్ నిర్వహించుకోవచ్చు. అంటే డేప్సాంగ్ మైదానాల్లో, డెమ్‌చోక్‌లోని చార్డింగ్ నుల్లాలో పెట్రోలింగ్ పాయింట్ వరకు భారత సైనికులు పెట్రోలింగ్ చేయొచ్చు. ఇక, ఈ ఒప్పందంలో భాగంగానే, తూర్పు ప్రాంతంలో, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని సున్నితమైన ప్రదేశాలకు సంబంధించి కొన్ని పరస్పర ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read:  డ్రోన్ పైలెట్లకు ఈ సర్టిఫికేట్ ఉంటే మస్తు పైసలు..

పెట్రోలింగ్ చేసే క్రమంలో రెండు వైపుల నుండీ సమన్వయం

నాలుగేళ్ల క్రితం, 2020లో ఘర్షణలు చోటుచేసుకున్న గాల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ త్సో పాయింట్లను రెండు సంవత్సరాల క్రితం బఫర్ జోన్‌లు ఏర్పాటు చేసి, దళాలను విడదీశారు. గతంలో ఇక్కడ పెట్రోలింగ్ చేసే సైనికులు 13 నుండి 18 మంది ఉండగా.. ఘర్షణను నివారించడానికి కనీసం 14 నుండి 15 మంది సైనికులు గస్తీలో ఉంటారని నిర్ణయించారు. ఇక, ఇప్పుడు, ఇరుపక్షాల పెట్రోలింగ్ పరస్పరం మార్చుకోడానికి ఒప్పందం కుదిరింది. పెట్రోలింగ్ చేసే క్రమంలో రెండు వైపుల నుండీ సమన్వయం ఉంటుందనీ.. ఒకరికొకరు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటాయని ఒప్పందంలో పొందుపరిచారు. ఇందులో భాగంగా, నెలవారీ ప్రాతిపదికన, కేస్-టు-కేస్ ఆధారంగా కమాండర్, కో-కమాండర్ స్థాయి సమావేశాలు కూడా నిర్వహించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇప్పటివరకు కుదిరిన అవగాహన ప్రకారం, డెప్సాంగ్‌లోని కీలక ప్రాంతాల నుండి చైనా దళాలు ఉపసంహరించుకుంటాయి. అయితే, ఇది లడఖ్‌లో రాబోయే తీవ్రమైన శీతాకాల ప్రణాళికలో భాగమేనని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

రెండు దేశాల మధ్య ఉన్నత-స్థాయి దౌత్య చర్చలు సులభతరం

2020లో గల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణ తర్వాత భారత్‌-చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే సరిహద్దుల వెంబడి ఇరువైపులా భారీగా బలగాలను మోహరించాయి. దాదాపు 68 వేల మంది సైన్యాన్ని భారత్‌ సరిహద్దుకు పంపించింది. సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యం ఏదైనా కవ్వింపులకు పాల్పడితే.. దానికి దీటుగా స్పందించేందుకు ఇండియన్ ఆర్మీ అన్నివిధాలా సిద్ధమైంది. అయితే, ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆర్మీ కమాండర్ స్థాయిలో గత నాలుగేళ్లుగా చర్చలు జరుగుతూనే ఉండగా.. తాజాగా కీలక పురోగతి కనిపించింది. దీనితో, అంతర్జాతీయ ఫోరమ్‌లలో రెండు దేశాల మధ్య ఉన్నత-స్థాయి దౌత్య చర్చలు సులభతరం అవుతాయి. అలాగే, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయి. దీనితో పాటు, సరిహద్దులో భారత్ చేస్తున్న మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉంటుంది. ఇక, చైనా విషయానికొస్తే, ఇతర ప్రపంచ ఉద్రిక్తతల మధ్య భారతదేశంతో సరిహద్దు వివాదాలను తగ్గించడం దానికి వ్యూహాత్మక లాభమనే చెప్పాలి.

వ్యాపార సంబంధాలు మెరుగుపడే అవకాశం

ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య దెబ్బతిన్న వ్యాపార సంబంధాలు కూడా ఇప్పుడు మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది. గత నాలుగు సంవత్సరాలుగా చర్చల సమయంలో చైనా చూపించిన మొండి వైఖరి వల్ల… చైనా సంస్థల పెట్టుబడులను పరిశీలించడాన్ని భారత్ జాప్యం చేసింది. చైనా ప్రధాన ప్రాజెక్టులను నిలిపివేసింది. BYD, గ్రేట్ వాల్ మోటార్ వంటి కార్ల తయారీదారులు పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చినప్పుడు కూడా బిలియన్ల డాలర్లను తిప్పికొట్టింది. అయితే, ఇప్పుడు చైనాతో వాణిజ్యం, పెట్టుబడుల్లో తదుపరి చర్యలు ముందుకు కదిలే అవకాశం కనిపిస్తోంది.

 

Related News

Iran Israel War: ప్రాణ మిత్రులు బద్ద శత్రువులు ఎలా అయ్యారు? ఇరాన్-ఇజ్రాయెల్ నడుమ చిచ్చు ఎలా మొదలైంది?

Kavitha: కవితకు ఏమైంది? సవాలు చేసి సైలెంట్ అయ్యారు ఎందుకు?

Salman Khan: సల్మాన్ నిజంగానే ఆ జింకను కాల్చాడా? ఆ రోజు అతనితో ఉన్న హీరోయిన్స్ ఎవరు? వారికీ ముప్పుందా?

Chandrababu Vision: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ తో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో తెలుసా? హైదరాబాద్‌కు విశాఖ ప్రత్యామ్నాయం కానుందా?

Drone Pilot Training: డ్రోన్ పైలెట్లకు ఈ సర్టిఫికేట్ ఉంటే మస్తు పైసలు..

Peddireddy: ఆగని పెద్దిరెడ్డి దందా? షాక్ లో టీడీపీ

Big Stories

×