IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025 )టోర్నమెంట్ కోసం పది ఫ్రాంచైజీలు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. 10 ఫ్రాంచైజీలు తమ.. రిటెన్షన్ లిస్టును రెడీ చేస్తున్నాయి. అయితే.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కూడా తమ జట్టును ఫైనల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే… తమ జట్టు కెప్టెన్ కే ఎల్ రాహుల్ ను ( Kl Rahul ) వదులుకోవాలని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ( Lucknow Super giants) యాజమాన్యం నిర్ణయం తీసుకుందట.
దాదాపు కేఎల్ రాహుల్ తో ( Kl Rahul ) మూడు గంటల పాటు… లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ( Sanjeev Goenka ) చర్చలు నిర్వహించారట. అయినప్పటికీ ఆ చర్చలు విఫలమైనట్లు సమాచారం. లక్నో వీడాలని కేఎల్ రాహుల్ అనుకుంటున్నారట. అందుకే లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ( Sanjeev Goenka ) కూడా.. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ తరుణంలోనే లక్నో జట్టుకు వచ్చే సీజన్ లో నికోలాస్ పురాన్ ( Nicholas Pooran ) కెప్టెన్ అవుతారని వార్తలు వస్తున్నాయి.
Also Read: Glasgow Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !
అంతేకాదు తమ రిటెన్షన్ లిస్టును కూడా లక్నో సూపర్ జెంట్స్ ( Lucknow Super giants) ఫైనల్ చేసిందట. ఈ లెక్క ప్రకారం… ఈసారి మయాంక్ యాదవ్ ( Mayank Yadav), రవి బిష్టోయ్, నికోలాస్ పురాన్ ( Nicholas Pooran ) ను రిటైన్ చేసుకుందట లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. అయితే.. ఇందులో మయాంక్ యాదవ్ ( Mayank Yadav) కు ఈ సారి 14 కోట్లు ఇవ్వాలని డిసైడ్ అయిందని అంటున్నారు.
Also Read: IPL 2025: RCBకి ఎదురుదెబ్బ… కర్ణాటక ప్లేయర్లను మాత్రమే తీసుకోవాలని కాంగ్రెస్ హుకుం ?
మొత్తానికి అయితే… ఐపీఎల్ ఫ్రాంచైజీ, లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super giants) , 2025 వేలానికి ముందే కెప్టెన్ కేఎల్ రాహుల్ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2022లో జట్టును ప్రారంభించినప్పటి నుండి రాహుల్, మూడు సీజన్లకు ఫ్రాంచైజీకి నాయకత్వం వహించాడు, వాటిలో రెండు ప్లేఆఫ్ కు అర్హత సాధించాయి. అయితే… లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super giants) ను వదిలేసి.. బెంగళూరుకు వెళ్లేందుకు కేఏల్ రాహుల్ ఫిక్స్ అయ్యారట.
Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !
బెంగళూరు జట్టులోకి వెళ్లితే.. కేఎల్ రాహుల్ ( Kl Rahul ) కెప్టెన్సీ ఇస్తారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే కేఎల్ రాహుల్ జారు కుంటున్నాడని అంటున్నారు. వేలంలోకి వెళ్లాక రాహుల్ ను ( Kl Rahul ) బెంగళూరు కొనుగోలు చేయనుందట. కాగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025 )టోర్నమెంట్ రిటెన్షన్ లిస్ట్ ను 10 ఫ్రాంచైజీలు అక్టోబర్ 31 వ తేదీలోపు బీసీసీఐకి ఇవ్వాల్సి ఉంది. అప్పుడే అన్ని జట్లు ఫైనల్ అవుతాయి.