Glasgow Commonwealth Games 2026: కామన్ వెల్త్ క్రీడలు ( Common wealth Games 2026) మరో రెండేళ్ల లో జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇలాంటి నేపథ్యంలో.. మన భారత దేశానికి ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది. ఇండియాకు ( India ) భారీ నష్టం జరిగిలే సంచలన నిర్ణయం తీసుకుంది కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ( Commonwealth Games Federation ). గ్లాస్గో ( Glasgow )వేదికగా జరగనున్న కామన్ వెల్త్ ఆటల ( Common wealth Games 2026) నుంచి హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, క్రికెట్, షూటింగ్, స్క్వాష్, నెట్ బాల్, రోడ్ రేసింగ్ ను తొలగించనున్నారు.
తాజాగా ఈ విషయాన్ని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ( Commonwealth Games Federation ) అనౌన్స్ చేసింది. దీనితో క్రీడాభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా భారత అభిమానులు ఈ విషయం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2022లో బర్నింగ్ హామ్ వేదికగా 19 ఈవెంట్లను నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం ఖర్చులను కాస్త తగ్గించడానికి 10 ఈవెంట్లను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ICC: క్రికెట్ లో 3 కొత్త రూల్స్..ఇకపై అన్ని డేనైట్ టెస్ట్లు, రెండు బంతులే ?
నాలుగేళ్లకు ఓసారి జరిగే ఈ కామన్వెల్త్ క్రీడలు 2026లో ( Common wealth Games 2026) స్కాట్లాండ్ లోని గాస్గోలో జరగనున్నాయి. వచ్చే సంవత్సరం జూలై 23 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇదిలా ఉండగా…. తాజాగా కామన్వెల్త్ నిర్వాహకులు తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశంలో ఒకరకంగా చాలా రకాలుగా ఇబ్బందికరమే అని క్రీడా నిపుణులు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: IPL 2025: RCBకి ఎదురుదెబ్బ… కర్ణాటక ప్లేయర్లను మాత్రమే తీసుకోవాలని కాంగ్రెస్ హుకుం ?
దీనికి గల కారణం రెజ్లింగ్ , హాకీ, క్రికెట్ ( Cricket ), బ్యాడ్మింటన్, షూటింగ్ ( Shooting ) లాంటి అనేక క్రీడల్లో భారత్ కు పతక అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రతిసారి భారతదేశంలో ఈ క్రీడల పట్ల పథకాలు చాలానే వచ్చాయి. ఇప్పుడు ఈ క్రీడలను తొలగించడం వల్ల మెడల్స్ సంఖ్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందని భారత్ క్రీడా నిపుణులు నిరాశ చెందుతున్నారు.
Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !
కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ( Commonwealth Games Federation ) నిర్ణయంపై టీమిండియా మహిళా క్రికెటర్లు, టెన్నిస్ ప్లేయర్లు, బ్యాడ్మింటన్ , హాకీ ప్లేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు 2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ( Common wealth Games 2026) నుంచి బ్యాడ్మింటన్ సహా కీలక క్రీడలను మినహాయించడంపై భారత క్రీడా ప్రముఖులు పుల్లెల గోపీచంద్ ( pullela Gopi chand ), విమల్ కుమార్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటువంటి నిర్ణయాలు అథ్లెటిక్స్లో భారతదేశం పురోగతికి ఆటంకం కలిగిస్తాయని పేర్కొన్నారు. బదులుగా ఒలింపిక్స్, ఆసియా క్రీడలపై దృష్టి పెట్టాలని వారు వాదించారు.