హైదరాబాద్, స్వేచ్ఛ: బాధ్యత గల ప్రతిపక్షంగా మూసి పునరుజ్జీవనానికి బిఆర్ఎస్ సహకరించాలని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్ డెవలప్ మెంట్ లో మూసీని భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. నిర్వాసితులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దు వారి కష్టాలు మాకు తెలుసు. వారికి ఎలాంటి కష్టం రానివ్వం అన్నారు. వారికి పునరావాసం, ఉచిత వైద్య, విద్య సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కేటీఆర్ కూడా గతంలో విదేశీ పర్యటనలు చేశారని..ఇలాంటి నదులను అధ్యయనం చేయకుండా పర్యటనలు ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి అన్నారు.