TSRTC MD VC Sajjanar: సజ్జనార్ సారూ.. 10 బస్సులకు 4 బస్సులే నడుపుతున్నారని కొంతమంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాలేజీకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు తమ ఆవేదన తెలుపుతూ విద్యార్థులు ఓ లేఖ రాశారు. ఫుట్ బోర్డు మీద వేలాడుతున్న తమకు భరోసా కల్పించేదేవరని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాల ప్రకారం.. షాద్ నగర్ – ఆమన్ గల్ రూట్లో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెప్పుకొచ్చారు. ఈ రూట్లో గతంలో 10 బస్సులు నడిపిస్తే ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కావున మా బాధలు తెలుసుకొని బస్సుల సంఖ్యను పెంచాలని సజ్జ నార్కు లేఖ రాశారు.
Also Read: కేటీఆర్కు ప్రాక్టికల్ నాలెడ్జి లేదు.. అంతా బుక్ నాలెడ్జ్.. జగ్గారెడ్డి ఫైర్
డిగ్రీ కాలేజీలు దూరంగా ఉండడంతో ఆర్టీసీ ద్వారా పరిమితి సరిపోవట్లేదని ఓ విద్యార్థి మధు లేఖలో తెలిపారు. డిగ్రీ, ఉన్నత చదువుల చేసే వారి కోసం 45 నుంచి మ60 కిలోమీటర్ల వరకు బస్ పాస్ పరిమితి పెంచాలని విద్యార్థులు కోరారు. అదేవిధంగా షాద్ నగర్ – మహబూబ్ నగర్ రూట్లో కూడా పల్లె వెలుగు బస్సులు నడపాలని సజ్జ నార్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.