EPAPER

Telangana Group-1 exams: గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు, అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

Telangana Group-1 exams: గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు, అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

Group-1 exams: గ్రూప్-1 పరీక్షలో విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.


తెలంగాణ హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతోందని, తుది నియామకాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అక్కడే విచారణ జరపాలని ఆదేశించింది. ఫలితాలు వెల్లడించ డానికి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకి సూచన చేసింది.

తెలంగాణాలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఆపాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం ఉదయం విచారణకు స్వీకరించింది. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు పిటిషన్లలో ప్రస్తావించారు.


అభ్యర్థుల తరపున కపిల్ సిబాల్, నిరంజన్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ తన వాదనలు వినిపించారు. పరీక్ష జరుగుతుండడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేని తేల్చేసింది సుప్రీంకోర్టు. ఇప్పటికే విద్యార్థులు పరీక్షా కేంద్రాలను వెళ్లారన్న సీజేఐ. ఈ పరిస్థితుల్లో స్టే ఇవ్వలేమని తేల్చేసింది ధర్మాసనం. తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని సూచన చేసింది.

ALSO READ: జిల్లాకో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఛైర్మన్లుగా నేతలకు ఛాన్స్!

దీంతో చాలా ఏళ్ల తర్వాత తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు.  సోమవారం నుంచి గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందకుండా, పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలన్నారు. ఈ పరీక్షల్లో మీరు విజయం సాధించి, తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎక్స్‌లో రాసుకొచ్చారు.

 

 

 

 

Related News

MLA Kadiyam Srihari : ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేవని కేసీఆర్‌’తో చెప్పా, అందుకే నన్ను పక్కన పెట్టేశారు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

Brs Working President KTR : విద్యుత్ ఛార్జీల మోతకు మేం వ్యతిరేకం, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌’ను కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్

Cm Revanth Reddy : ఒక సీఎంగా పరిపాలన ఎంత అవసరమో, విద్యార్థులకు, అభ్యర్థులకు హితోపదేశం కూడా అంతే ముఖ్యం, నిరూపించిన సీఎం

Malla Reddy Dance Video: డీజే టిల్లు పాటకు అదిరే స్టెప్పులు వేసిన మల్లారెడ్డి.. కొరియోగ్రాఫర్ ఎవరంటే?

CM Revanth Reddy: ఆ ఒక్క ట్వీట్ తో మనసు దోచేసిన సీఎం రేవంత్.. అసలు ఆ ట్వీట్ లో ఏముందంటే?

Urban development Authority Plan: జిల్లాకో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఛైర్మన్లుగా నేతలకు ఛాన్స్!

Big Stories

×