Prabhas New Movie Up dates : లాస్ట్ ఇయర్ ఈ టైమ్కి బాబ్బాబూ ఒక్క అప్డేట్, బాబ్బాబూ ఒక్క అప్డేట్ అంటూ లిటరల్గా డైరక్టర్ రాధాకృష్ణకుమార్నీ, యువీ క్రియేషన్స్ ని సోషల్ మీడియా వేదికగా అడుక్కున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అభిమానులకు చిరాకొస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అర్థమైంది ప్రభాస్కి. అందుకే ఈ న్యూఇయర్కి లెక్కకు మించి అప్డేట్స్ ఇస్తున్నారు. మొన్నటికి మొన్న నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ చేసిన సందడి అంతా, ఇంతా కాదు. జనవరి 6న సెకండ్ పార్ట్ కూడా టెలికాస్ట్ కి రెడీ అవుతోంది.
ఈ గ్యాప్లో సైలెంట్గా ప్రాజెక్ట్ కె నుంచి అప్డేట్ ఇచ్చేశారు డైరక్టర్ నాగ్ అశ్విన్. రి ఇన్వెంటింగ్ ది వీల్ అంటూ ప్రాజెక్ట్ కె ఫస్ట్ ఎపిసోడ్ అంటూ స్నీక్ పీక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఏంటి ఒక్క టైర్ చేయడానికి ఇంత సీనా? అంటూ యూనిట్ మెంబర్సే మాట్లాడుకోవడం విన్నాం. స్క్రాప్ నుంచి ప్రతిదీ ఈ మూవీ కోసం రెడీ చేస్తున్నారు నాగ్ అశ్విన్. గ్లింప్స్ లో ఎవరో అన్నట్టు, ఈ ప్రాజెక్ట్ ని అర్థం చేసుకోవడానికి కూడా జనాలకు సమయం పడుతుందేమో. 500 కోట్ల రూపాయలతో తెరకెక్కుతోంది ఈ సినిమా. దీపిక పదుకోన్ నాయికగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కీ రోల్ చేస్తున్నారు. మాయాబజార్కి పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు, ఈ ప్రాజెక్ట్ కె లో ఇన్వాల్వ్ అయ్యారు.
ఈ మూవీలో వెహికల్స్ కోసం మహేంద్ర కంపెనీతో డీల్ ఓకే చేసుకున్నారు మేకర్స్. ప్రియాంక దత్ నిర్మిస్తున్న సినిమా ఇది. వరల్డ్ వార్ త్రీ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు సమాచారం. వీఎఫ్ ఎక్స్ హెవీగా ఉంటాయి. డ్రామా, ఎమోషన్స్ ఈ కథలో యుఎస్పీ అవుతాయి. ఈ ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. వచ్చే ఏడాది, అంటే 2024 సమ్మర్కి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హాలీవుడ్ బేస్డ్ యాక్షన్ డైరక్టర్స్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఐమ్యాక్స్ ఎక్స్ పీరియన్స్ కోసం టాప్ నాచ్ గ్రీన్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ని సెట్ చేస్తున్నారు. టాలీవుడ్లో 50 వసంతాల చరిత్ర ఉన్న నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.