Tragedy in Krishna District two students died: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులోకి స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. గన్నవరం మండలంలోని బాదలవారిగూడెంలో ఏడుగురు విద్యార్థులు స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు. అనంతరం సెల్పీ తీసుకునేందుకు యత్నించారు. ఈ సమయంలో కాలు జారి కిందపడ్డారు.
చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండడంతో పాటు నీటి ప్రవాహానికి ఈదలేక కొట్టుకుపోయారు. అయితే ఐదుగురు విద్యార్థులు బయటపడగా.. ఇద్దరు విద్యార్థులు మునిగిపోాయరు. వెంటనే స్థానికులు వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇందులో దుర్గారావు, వెంకటేష్ లు ప్రాాణాలు విడిచినట్లు గుర్తించారు. వీరంతా ఇంజినీరింగ్ విద్యార్థులుగా తెలిసింది.
Also Read: తెర మీదకు జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్, జేసీ పాత్రలో ఒదిగిపోనున్న ‘ఆల్ రౌండర్’ అతనే ?
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలంలో కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఈ ప్రమాదంపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో లింగయాస్ కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.